కరోనా మహమ్మారి ఐరోపా దేశాలను అతలాకుతులం చేస్తున్నది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల్లో మరణమృదంగం మోగిస్తున్నది. అయితే మిగిలిన ఐరోపా దేశాలతో పోలిస్తే జర్మనీ కరోనాను సమర్థంగా నిలువరిస్తోంది. ఇటలీ, బ్రిటన్లలో మరణాల రేటు 12 శాతం ఉండగా, జర్మనీలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం కరోనావైరస్ ప్రభావం ఐరోపాలో ఎక్కువగా కనిపిస్తోంది. ఐరోపాలో 100,000 మందికిపైగా కరోనా ప్రభావంతో మరణించారు. యూరప్ లో మొత్తం 1,136,672 మందికి వైరస్ సోకగా అందులో మొత్తం 100,501 మంది మరణించారు. కోవిడ్-19 మహమ్మారి చేత తీవ్రంగా దెబ్బతిన్న ఖండంగా ఐరోపా నిలిచిపోయింది. ఈ వైరస్ ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 157,163 మంది చనిపోయారు. ఈ వివరాలు ప్రపంచ ఆరోగ్యసంస్థ ( డబ్ల్యుహెచ్ ఓ ) వెల్లడించింది.