ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులు,ఏటీఎంలకు కొత్త రూల్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 15, 2020, 04:59 PM

 కరోనా వైరస్ ప్రభావంతో భారత్ లో మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో సడలింపులనిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో బ్యాంకులు కూడా ఉన్నాయి. బ్యాంకులకు సంబంధించిన మార్గదర్శకాలు ఈ విధంగా ఉన్నాయి.


- బ్యాంకు బ్రాంచ్‌లు సాధారణ పనివేళల్లో తెరిచి ఉండేందుకు అనుమతి లభించింది. అయితే ఇది నగదు బదిలీ పూర్తయ్యేవరకు మాత్రమేనని హోం శాఖ స్పష్టంగా తెలియజేసింది.


- బ్యాంకు బ్రాంచ్‌లు, ఏటీఎంలు, బ్యాంకు నిర్వహణకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించేవారు, బ్యాంక్ కరస్పాండెంట్స్, ఏటీఎం నిర్వహణ, క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలకు ఎంపిక చేసిన కార్యకలాపాలు నిర్వహించడానికి మాత్రమే అనుమతి ఉంది.


- బ్యాంకులు, ఏటీఎంల దగ్గర సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేలా స్థానిక అధికార యంత్రాంగం సెక్యూరిటీ కల్పించాలని హోం శాఖ ఆదేశించింది.


- ఆర్థిక రంగంలో బ్యాంకులు, ఏటీఎంలతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI, సెబీ నోటిఫై చేసిన క్యాపిటల్, డెట్ మార్కెట్లు, ఐఆర్‌డీఏఐ, ఇన్స్యూరెన్స్ కంపెనీలు, ఎన్‌పీసీఐ, సీసీఐఎల్, పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ కార్యకలాపాలు సాగిస్తాయి.


- అయితే సవరించిన ఈ గైడ్‌లైన్స్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా అధికారులు గుర్తించిన కంటైన్‌మెంట్ జోన్లల్లో వర్తించవు.


- ఒకవేళ కంటైన్‌మెంట్ జోన్‌గా ఏదైనా కొత్త ప్రాంతాన్ని గుర్తిస్తే ఆ ప్రాంతంలో సవరించిన గైడ్‌లైన్స్ అన్నీ రద్దవుతాయి.


కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన గైడ్‌లైన్స్ తక్షణం అమలులోకి వస్తాయని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com