లాక్డౌన్తో చిక్కుకుపోయిన అమెరికన్లు మరో రెండు విమానాల్లో ఆదివారం బయల్దేరారు. తెలంగాణ ప్రభుత్వం, అమెరికా కాన్సులేట్ సమన్వయంతో వీరిని ఆ దేశానికి పంపారు. మధ్యాహ్నం మొదటి విమానంలో 81 మంది పెద్దలు, ఒక శిశువు ముంబైకి బయల్దేరారు. మరో విమానంలో 82 మంది పెద్దలు, ఒక శిశువుతో ముంబైకి బయల్దేరింది. పూర్తి శానిటైజర్ చేసిన తర్వాత టెర్మినల్ ద్వారా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వీరిని పంపించారు. ఈ రెండు విమానాలు ముంబై మీదుగా అమెరికా వెళ్లనున్నట్లు ఆర్జీఐఏ అధికారులు వెల్లడించారు.