ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా మృతుల సంఖ్య లక్షకు పైనే...

international |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 10:44 AM

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మరణమృదంగం కొనసాగిస్తోంది. ఈ మహమ్మారి ఇప్పటివరకు లక్షమందికి పైగా ప్రాణాల్ని బలిగొంది. 16 లక్షల 99 వేల మందికి పైగా ఈ వైరస్ సోకగా 3 లక్షల 76 వేలమందికి పైగా కోలుకున్నారు. యూరప్ దేశాలు, అమెరికాపై కరోనా పంజా కొనసాగుతూనే ఉంది. ఇటలీలో 18, 849 మంది చనిపోగా అమెరికాలో 18,747 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్ లో 16 వేలమందికి పైగా బలిగొన్న ఈ మహమ్మారి ఫ్రాన్స్ లో 13 వేలమందికి పైగా ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. బ్రిటన్ లో 8,958 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది. భారత్ లో ఇప్పటివరకు 7,447 మందికి వైరస్ సోకగా 239 మంది చనిపోయారు. 643 మంది ఈ మహమ్మారిని జయించి డిశ్చార్జ్ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com