మొట్టమొదటిసారి కరోనా వెలుగుచూసిన వుహాన్ నగరవాసులకు చైనా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా పంజా విసిరింది. ఎట్టకేలకు ఆ వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. 76 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత బుధవారం నుంచి లాక్ డౌన్ ఎత్తివేశారు. కరోనా వైరస్ మొదట వ్యాపించింది కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. దాని చుట్టూ హ్యూబే ప్రావిన్స్ ఉంది. ఈ మొత్తం ప్రదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఉండేవారు. కరోనా వ్యాపించిన కొన్నాళ్లకు వుహాన్లో లాక్డౌన్ ప్రకటించిన చైనా ప్రభుత్వం ఆ తర్వాత హ్యూబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఇప్పుడు కరోనా వైరస్ కంట్రోల్ కావడంతో 11 వారాల తర్వాత అంటే 76 రోజుల లాక్డౌన్కి గుడ్బై చెప్పింది ప్రభుత్వం. దీంతో వుహాన్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు.