ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో 24 గంటల్లో 1480 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 01:55 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. మరణ మృదంగం వినిపిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతోంది. పలు దేశాల్లో ఈ ప్రాణాంతక వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని ఫలితంగా అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయింది. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా.. అదే స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com