ఇటలీలో పరిస్థితి అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా పూర్తిగా స్తంభించిపోయిన ఆ దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో ఆదాయం లేక ప్రజలు అవస్తలు పడుతున్నారు. ఇటలీలో 24 గంటల్లో 838 మందిని కరోనా వైరస్ బలిగొందని ఆదివారం సాయంత్రం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 10,779కి పెరిగింది. మరో 3,186 మంది కొత్తవారు ఈ వైరస్ బారినపడడంతో బాధితుల సంఖ్య 97689కి చేరింది.