దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నా... రికవరీ కేసులు ఎక్కువగానే ఉండండంతో... కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 15 తర్వాత లాక్డౌన్ పొడిగిస్తారంటూ.. జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. లాక్డౌన్ పొడిగించే ఉద్దేశం లేదనీ, అలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రకటించిన.. ఆర్థిక ప్యాకేజీ, టాక్సుల చెల్లింపులు, ఈఎంఐల చెల్లింపుల్ని మూడు నెలలపాటూ వాయిదా వేయడంతో... అప్పటి వరకూ లాక్డౌన్ ఉంటుందని చాలా మంది సోషల్ మీడియాలో ఫుల్లుగా ప్రచారం చేస్తుంటే... కేంద్రం దానిపై స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అనంతరం లాక్డౌన్ వల్ల వలస కార్మికులు, పేదలు, రోజువారీ కూలి పని చేసుకునేవారు, శ్రామికులు బాగా దెబ్బతిన్నారు. ఇప్పుడు వారికి కనీసం కడుపు నింపుకోవడానికి కూడా చేతిలో డబ్బు లేకుండా పోయింది. మరో రెండు వారాలు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ రెండు వారాలూ ఎలా గడపాలో కూడా వాళ్లకు అర్థం కావట్లేదు. ఇలాంటప్పుడు లాక్డౌన్ పొడిగిస్తే... కోట్ల మంది కడుపుకొట్టినట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందువల్ల కేంద్రం లాక్డౌన్ పొడిగించకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు దేశ ప్రజలు వచ్చే రెండు వారాలే లాక్డౌన్ ఉంటుందన్న ఉద్దేశంతో తమ ప్రణాళికలు వేసుకోవడం మేలు. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు కేరళ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతున్నాయి తప్ప... మిగతా రాష్ట్రాల్లో అంత జోరేమీ లేదు. అందువల్ల అవసరమైతే.... కేసులు పెరిగే రాష్ట్రాల్లో మాత్రమే కేంద్రం మున్ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఏప్రిల్ 15 తర్వాత లాక్డౌన్ నుంచి స్వేచ్ఛ లభించనుంది.