ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోవిడ్-19 కారణంగా ఇటలీలో 50 మంది డాక్టర్లు మృతి

international |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 11:32 AM

కరోనా ధాటికి ప్రపంచం కకావికలమవుతోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, బంద్‌ లతో ఇలా ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖంగా ఇటలీ తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో 10,779 మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే, కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు కూడా బలవుతున్నారు. ఇటలీలో ఇప్పటిదాకా 50 మంది డాక్టర్లు కరోనాతో చనిపోయినట్టు అక్కడి నేషనల్​ ఫెడరేషన్ ఆఫ్​ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ తెలిపింది. కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న లాంబార్డీకి చెందిన డాక్టర్లే అందులో 17 మంది ఉన్నట్లు వెల్లడించింది. వైద్యులు కరోనాపై ఎలాంటి రక్షణ లేకుండానే దాడికి దిగారని, ఈ క్రమంలో వాళ్లే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఆ సంస్థ ప్రెసిడెంట్ ఫిలిప్పో అనెల్లీ. ఇటలీ వ్యాప్తంగా 7,100 మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు ఆయన వెల్లడించారు. దీన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్నీ నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com