ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌కు చైనా ఆపన్నహస్తం

international |  Suryaa Desk  | Published : Sun, Mar 29, 2020, 02:08 PM
భారతదేశానికి పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్థాన్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 1197 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో తొమ్మిది మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే ఆ దేశానికి సాయం చేసేందుకు చైనా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఎనిమిది మంది వైద్యనిపుణులు, అవసరమైన వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక విమానం శనివారం ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నట్టు ఆ దేశ విదేశాంగమంత్రి షా మహ్మద్‌ ఖురేషి తెలిపారు. ఈ వైద్య బృందం పాక్‌లో రెండువారాల పాటు ఉండి తమ వైద్య సిబ్బందికి సరైన సూచనలు ఇస్తూ కరోనా కట్టడికి కృషి చేయనున్నట్లు ఆ దేశ విదేశాంగశాఖ కార్యాలయం వివరించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com