కరోనాతో ఓ వైపు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే మరోవైపు శుక్రవారం ఉదయం ఇండోనేషియా దేశంలో భూకంపం సంభవించింది. ఇండోనేషియా తూర్పున ఉన్న పాపువా ప్రావిన్సు పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున 4.36 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9 అని ఇండోనేషియా మెట్రోలాజీ అండ్ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇండోనేషియా సర్కారు వెల్లడించింది.