కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో న్యూజిలాండ్ కూడా చేరింది. న్యూజిలాండ్లో నెల రోజుల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల కొసం మినహా ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదన్నారు. ఈ మేరకు జెసిండా పార్లమెంటులో ప్రకటించారు.