ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు, దాడుల పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అక్కడి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుండటంతో అయనకు అక్కడి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది.. గత అర్ధరాత్రి రంగంలోకి దిగిన ఇండియన్ జేమ్స్ బాండ్ అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. జాఫ్రాబాద్, శీలంపూర్ ప్రాంతాల్లో పర్యటించి వివిధ మతాలకు చెందిన నేతలతో ఆయన చర్చలు జరిపారు. అలాగే నేడంతా అల్లర్లు జరిగే ప్రాంతంలో ఇంటింటికి తిరిగారు.. అక్కడి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారితో ధైర్యం నింపారు.. అందరూ సమన్వయంతో ఉండాలని అనుకూల, ప్రతికూల వర్గాలకు నచ్చ జెప్పారు.. ప్రతి ప్రాంతంలో శాంతి కమిటీలను అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు.. అలాగే పోలీసులకు తోడుగా, పారా మిలటరీ బలగాలను రంగంలోకి దించారు. పనిలో పనిగా అయిదుగురు ఐపిఎస్ అధికారులను ఈ ప్రాంతం నుంచి బదిలీ చేయించారు.. సమర్ధత కలిగిన ఐపిఎస్ లను రంగంలోకి దింపారు దోవల్.ఎప్పటికప్పడు ఆ ప్రాంత అలర్లలపై సమీక్షలు చేస్తూ దూసుకుపోతున్నారు.. కాగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమీత్ షాలు కూడా అందరూ సమన్వయంతో ఉండాలని కోరారు.. అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల కూడా ప్రజలు హింసకు దూరంగా ఉండాలని విజ్నప్తి చేశారు.. ఘర్షణలో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కు కోటి రూపాయిలు నష్టపరిహారం ప్రకటించారు కేజ్రీవాల్.. అలాగే అతడి సతీమణికి ఉద్యోగంతో పాటు పిల్లల విద్య తామే చూసుకుంటామని హామీ ఇచ్చారు..ఇక దోవల్ రంగంలోకి దిగిన తర్వాత ఈశాన్య ఢిల్లీలో ప్రశాంతం పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. ఎక్కడికక్కడ పికెట్ లు ఏర్పాటు చేసి పోలీసులు కాపాల కాస్తున్నారు.. డ్రోన్ లో ఆ ప్రాంతం అంతా పర్యవేక్షిస్తున్నారు.. ఇక ఈశాన్య ఢిల్లీ ఫ్రాంతంలో సిబిఎస్ ఇ పరీక్షలను వాయిదా వేశారు..ఇప్పటి వరకూ ఇక్కడ జరిగిన దాడులలో ఇద్దరు పోలీసులతో సహా మొత్తం 23 మంది మరణించగా, 200 వందల మందికి పైగా గాయపడ్డారు..