ఇటీవల విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్లో భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ మొదటి స్థానం నుండి రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజీలాండ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో తన సత్త చూపలేకపోయాడు . ఆస్ట్రేలియా రన్ మెషిన్ స్టీవ్ స్మిత్ 911 పాయింట్లతో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటి నంబర్ 1 టెస్ట్ బ్యాట్స్ మాన్ హోదాను పొందాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో పది వికెట్లతో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి కేవలం 21 పరుగులు చేసిన కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ 906 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు.
కాగా.. బౌలర్ల విభాగంలో భారత పేసర్కు జస్ప్రీత్ బుమ్రాకు షాక్ తగిలింది. తొలి టెస్టులో ఒక్క వికెట్ మాత్రమే తీయడంతో తను తాజా ర్యాకింగ్స్లో 11వ ర్యాంకుకు పడిపోయాడు. భారత్ నుంచి రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే తొమ్మిదో ర్యాంకులో నిలిచి, టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో అశ్విన్ ఐదోస్థానం దక్కించుకోగా.. రవీంద్ర జడేజా మూడో ర్యాంకులో నిలిచాడు.