విజయనగరం జిల్లా ఫిషరీస్ డెవలప్ మెంట్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. జిల్లా ఫిషరీస్ డెవలప్ మెంట్ అధికారి డి. మురళి రూ. 16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మత్స్యకార సంఘం సభ్యుల సభ్యత్వ నమోదు కోసం లంచం డిమాండ్ చేశాడు. అతనిపై ఏసీబీ అధికారులకు పిర్యాదు చేయడంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.