14 ఏళ్ల గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యప్రదేశ్ లోని బేతుల్ కు చెందిన గిరిజన బాలికపై మూడు నెలల క్రితం సందీప్ హసన్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఈ ఘటనపై పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసింది. తానకు ప్రాణ హని ఉందని తెలిపింది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మరణించిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీఎస్ భడోరియా మాట్లాడుతూ.. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.