ఢిల్లీ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 13 కి చేరింది. ఈశాన్య ఢిల్లీలో అల్లరి మూకలు కనిపిస్తే కాల్చేస్తామని ఉత్తర్వులు జారీ చేశారు. పారామిలటరీ బలగాలు, పోలీసులు రంగంలోకి దిగారు.ఈశాన్య ఢిల్లీలోని 4 ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక చర్యలు తీసుకున్నది. ఈ అల్లర్లలో 48 మంది పోలీసులకు గాయాలయ్యాయి. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమించారు. 4 ప్రాంతాల్లో షూట్ ఎట్ సైట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరుకూడా ఇళ్లను వదిలి బయటకు రావద్దంటూ పోలీసులు ప్రకటించారు. అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని అత్యంత నిశితంగా అమిత్ షా పరిశీలిస్తున్నారు.