ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు స్వైన్ ప్లూ బారిన పడ్డారు. వారందరూ ప్రస్తుతం సెలవుల్లో ఉండడంతో దాని ప్రభావం కేసుల పై పడుతుంది. దీంతో చాలా కేసులు విచారణ వాయిదా పడే అవకాశం ఉందని సీనియర్ జడ్జి డీవై చంద్రచూడ్ మంగళవారం అన్నారు. సుప్రీం కోర్టు ఆవరణలో స్వైన్ ఫ్లూ ప్రభావం ఉండడంతో కోర్టులో ప్రత్యేక డిస్పెన్సరీ, రక్షణ చర్యలు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల పై చీఫ్ జస్టిస్ బాబ్డే సమీక్షిస్తున్నారని చంద్రచూడ్ తెలిపారు.