ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో పేట్రేగిన హింస..

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 03:37 PM

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో చెలరేగిన హింస మంగళవారం కూడా కొనసాగుతున్నది. ఇప్పటిదాకా ఒక పోలీసుతోపాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అల్లర్లకు కేంద్రంగా ఉన్న ఈశాన్య ఢిల్లీలో సరిపడా పోలీసులు లేకపోవడంతో పారామిలటరీ బలగాలను మోహరింపజేశారు. అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం కేజ్రీవాల్ వివరణ కూడా అందుకు మరింత బలం చేకూర్చుతోంది.


అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ పర్యటిస్తున్న సమయంలోనే ఢిల్లీలో హింస చెలరేగడంతో కేంద్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తాయి. కావాలనే సెక్యూరిటీని తగ్గించి, హింస జరిగేందుకు అవకాశం కల్పించారంటూ ప్రతిపక్షపార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల్ని కూడా మీటింగ్ కు ఆహ్వానించారు. గంటకుపైగా సాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే.


 


సీఏఏ వ్యతిరేక నిరసనల్ని వెంటనే ఆపకుంటే శిబిరాల్ని మేమే తొలగిస్తామంటూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల వల్లే ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిందని సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు వాదించగా.. రాజకీయాలకు ఇది సమయం కాదని, హింసను అదుపుచేసేందుకు బీజేపీతోపాటు అన్ని పార్టీలూ సహకరించాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించకుండా ఈశాన్య ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేయడంతోపాటు ఆర్మీని కూడా రంగంలోకి దించాలనే ప్రతిపాదనపై మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. భేటీ తర్వాత.సీఏఏ వ్యతిరేక నిరసనల్ని వెంటనే ఆపకుంటే శిబిరాల్ని మేమే తొలగిస్తామంటూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల వల్లే ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిందని సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ నేతలు వాదించగా.. రాజకీయాలకు ఇది సమయం కాదని, హింసను అదుపుచేసేందుకు బీజేపీతోపాటు అన్ని పార్టీలూ సహకరించాలని కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. ఇతర ప్రాంతాలకు హింస వ్యాపించకుండా ఈశాన్య ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేయడంతోపాటు ఆర్మీని కూడా రంగంలోకి దించాలనే ప్రతిపాదనపై మీటింగ్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com