ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిపై కాబోయే భర్త స్నేహితుల గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 02:55 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో కామాంధుల పైశాచికానికి మరో మహిళ బలైపోయింది. బులంద్‌షహర్‌లో ఓ యువతిపై కాబోయే భర్త స్నేహితులే అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైలులో ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణికులతో తలెత్తిన వివాదంలో సాయం చేయాలని ఆమె కాబోయే భర్తను కోరింది. అతడు వేరే ప్రాంతంలో ఉండటంతో ఆమెకు తోడుగా ఉంటారని ముగ్గురు స్నేహితులను పంపించాడు. ఫ్రెండ్‌కు కాబోయే జీవిత భాగస్వామి అని కూడా చూడకుండా ఆ ముగ్గురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆర్నియా ప్రాంతానికి చెందిన యువతికి ఇటీవలే ఓ వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఆమె బుధవారం ఘజియాబాద్ వెళ్లేందుకు రైలెక్కింది. మార్గమధ్యలో సీటు విషయంపై కొందరితో ఆమెకు వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కాబోయే భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తోటి ప్రయాణికులు తనను బెదిరిస్తున్నారని, దుర్భాషలాడుతున్నారని చెప్పి ఏడ్చింది. అతడు వేరే ప్రాంతంలో ఉండటంతో ఆమెకు సాయం చేయమని ముగ్గురు ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి చెప్పాడు.


 


దీంతో వారు బారె రైల్వేస్టేషన్‌కు చేరుకుని యువతి తరపున మాట్లాడి వివాదాన్ని పరిష్కరించారు. ఆమె వెళ్లే చోటికి తీసుకెళ్తామని నమ్మించి బైక్ ఎక్కించుకున్నారు. మార్గమధ్యలో నిర్మానుష్యంగా ప్రాంతంలో బైక్ ఆపి ఆమెను బెదిరించారు. పొదల్లోకి లాక్కెళ్లి ముగ్గురు యువకులు ఆమెను దారుణంగా అత్యాచారం చేసి పరారయ్యారు. అక్కడి నుంచి ఎలాగోలా బులంద్‌షహర్‌ చేరుకున్న బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు బులంద్‌షహర్‌ సీనియర్ ఎస్పీ సంతోష్ ‌కుమార్ సింగ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com