ప్రజా వేదికలో మిగిలిపోయిన సామగ్రిని వేలం వేయాలన్న నిర్ణయంపై టీడీపీ సీనియర్ నాయకుడు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. అయితే, ప్రజా వేదిక కూల్చివేసిన ఎనిమిది నెలల తర్వాత అందులోని సామగ్రిని వేలం వేయడాన్ని తప్పుబట్టారు. కూల్చిన వెంటనే ఈ పని చేస్తే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని అభిప్రాయపడ్డారు.