అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా అమెరికా ఫస్టు లేడీ మెలానియా ఢిల్లీ దక్షిణ మోతీబాగ్ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్బంగా సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు. నుదిటిన కుంకుమ దిద్ది ఆమెను ఆహ్వానించారు. హ్యాపీనెస్ తరగతులను ఆమె విన్నారు. చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.