ఓ పథకం ప్రకారమే హింసను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మైనారిటీలకు విజ్ఞప్తి చేస్తున్నాం తప్పుడు మాటలు నమ్మొద్దని తెలిపారు. దేశ పౌరులందరికీ సీఏఏతో ఎలాంటి నష్టం ఉండదని అయన తెలిపారు. ఇంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ లేవు అని అన్నారు. ఢిల్లీలో ఆస్తులు తగలబెట్టడం, రాళ్ళు రువ్వడం చేశారు. ఎవరికోసం ఈ విధ్వంసం చేస్తున్నారని అయన ప్రశ్నించారు. ఏ వర్గం హింసను ప్రేరేపించినా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టాదని అయన తెలిపారు.అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత రాహిత్యంగా రెచ్చగొడుతున్నారని అయన తెలిపారు. ఎంతమంది ఒవైసీలు వచ్చినా సీఏఏను ఉపసంహరించుకోమని అయన అన్నారు.