అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ హౌస్ కు చేరుకున్నారు. హైదరాబాద్ హౌస్ లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. రెండు కీలక రక్షణ ఒప్పందాలపై భారత్- అమెరికా సంతకాలు చేసుకోనున్నారు. 24MH-60R హెలికాఫ్టర్లు, ఆరు అపాచీ హెలికాఫ్టర్ల అమ్మక ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు.