నేడు ఢిల్లీలో స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అల్లర్ల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సిఏఏఅనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణలలో హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారుజ గాయపడ్డవారిలో పారామిలటరీ సిబ్బందితో పాటు ఢిల్లీ పోలీసులు కూడా ఉన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నార్త్ ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులు పలు ఇళ్లు,దుకాణాలు,వాహనాలు,పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టడంతో నార్త్ ఢిల్లీ రణరంగాన్ని తలపించింది. సీఏఏ ఆందోళనకారులు, మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణ సందర్భంగా పరస్పరం రాళ్ల దాడి చేసుకోవడంతో రతన్ లాల్(42) అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. గోకల్పురిలోని ఏసీపీ కార్యాలయంలో అతను పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ముగ్గురు సాధారణ పౌరులు మృతి చెందారు. దాదాపు 11 మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో షహ్దరా డీసీపీ అమిత్ శర్మ,గోకల్పురి ఏసీపీ అనుజ్ కుమార్ ఉన్నారు. మరో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు.