ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 05:26 PM

రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్‌ కుష్నర్‌తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్‌నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్‌కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్‌... ‘ప్రేమచిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com