అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఆగ్రా చేరుకున్నారు. అహ్మదాబాద్లో మోతేరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం అనంతరం ట్రంప్ దంపతులు ఆగ్రా చేరుకున్నారు. ఆగ్రా ఎయిర్పోర్టులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రంప్ కు ఘన స్వాగతం పలికారు. మరికాసేపట్లో ట్రంప్ దంపతులు తాజ్మహల్ను సందర్శించనున్నారు. తాజ్ మహల్ వద్ద ట్రంప్ దంపతులు గంట సమయం గడపనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ట్రంప్ దంపతులు ఢిల్లిd బయలుదేరనున్నారు.