అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన కొనసాగుతోంది. మోతెరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ దంపతులతోపాటు, ప్రధాని మోదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..'' మోదీ జీవితం ఎంతో మందికి ఆదర్శం. ఒక ఛాయ్ వాలాగా జీవితం మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రపంచంలో అందరూ ప్రధానిమోదీని అభిమానిస్తారు. మోదీ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మోదీ గుజరాత్కు మాత్రమే ఆదర్శం కాదు. శ్రమ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చనే దానికి మోదీ నిదర్శనం. నా నిజమైన స్నేహితుడు మోదీ. అద్భుత విజేతగా దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. 5 నెలల క్రితం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ మైదానంలో మోదీకి స్వాగతం పలికాం. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానంలో నాకు స్వాగతం పలికారు'' అని ట్రంప్ అన్నారు.