అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నది. ఆశ్రమం వద్ద ట్రంప్ దంపతులకు మోడీ, విజయ్ రూపాని స్వాగతం పలికారు. సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు పరిశీలిస్తున్నారు. గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ట్రంప్, మోడీ నివాళులర్పించారు. ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమంలో చరఖా తిప్పారు. చరఖా పనితీరునకు ట్రంప్ అడిగి తెలుసుకున్నారు. సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ దంపతులు సంతకం చేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఉన్న మూడు కోతుల బొమ్మలను ట్రంప్ దంపతులు చూసి ముచ్చటపడ్డారు.