తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల హడావుడి పార్టీల్లో మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట వైసిపి ఫోకస్ పెట్టింది. రాజమండ్రి కార్పొరేషన్ తో పాటు మండపేట, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలపై వైసిపి కన్నేసింది. అధికార పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. మున్సిపాలిటీలలో గెలిచి జగన్ కు గిఫ్టుగా ఇస్తామని నాయకులు అంటున్నారు.