సీఎం జగన్ ను జైల్లో పెట్టే దమ్ము కేంద్రానికి లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలైన తేల్చండి, లేదా బెయిల్ రద్దు చేసి జైళ్లో పెట్టండని సీఎం జగన్ ప్రధానిని అడిగితే పనులు జరుగుతాయని ఉండవల్లి అన్నారు. రాష్ట్రానికి ఏం కావాలో సీఎం జగన్ ప్రధానితో చెప్పి సాధించుకుంటే రాష్ట్రంలో బలపడతారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు కేసుల కోసమే జగన్ మోడీతో భేటీ అయితే మాత్రం బలహీనుడవుతాడు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజాభిప్రాయంలో జగన్ టాప్ లీడర్ అని నిరూపించుకుంటే జైళ్లో పెట్టే ధైర్యం కేంద్రానికి ఉండదు అని మాజీ మంత్రి ఉండవల్లి అన్నారు.