ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కృషిని జాతీయ పత్రికలు కీర్తించాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2020, 08:01 PM

జగన్ సర్కార్‌పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ రోజుకో పరిశ్రమను వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. పదే పదే సీమ జపం చేసే జగన్ ఆ ప్రాంత పరిశ్రమలను ఎందుకు వెళ్లగొడుతున్నారని ప్రశ్నించారు. మొన్న కియా, నిన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, నేడు రిలయన్స్ జియో.. ఇలా ఒక్కొక్కటి రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయన్నారు. నాడు చంద్రబాబు ఎంతో శ్రమించి రిలయన్స్ జియో, సెటప్ బాక్స్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాల యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారని గుర్తుచేశారు. మొబైల్ తయారీలో ఏపీని అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. 100 నుంచి 150 మినియన్ ఫోన్ల తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేశారన్నారు. చంద్రబాబు కృషిని జాతీయ పత్రికలు కీర్తించాయని పేర్కొన్నారు. టెలికాం రంగంలోకి రిలయన్స్ ప్రవేశించడానికి చంద్రబాబు సూచనలే కారణమని ముఖేష్ అంబానీ స్వయంగా చెప్పారని వెల్లడించారు. చంద్రబాబు నెలకొల్పిన రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను చూసి ముఖేష్ అంబానీ కూడా ఆశ్చర్యపోయారన్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి రిలయన్స్‌ను పంపేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. రిలయన్స్ భూమి వెనక్కు ఇమ్మని ఎమ్మార్వో చేత నోటీసులు ఎందుకు ఇప్పించారని నిలదీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com