ట్రెండింగ్
Epaper    English    தமிழ்

థాయిలాండ్‌లో కాల్పులు...17మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sun, Feb 09, 2020, 07:59 PM

థాయిలాండ్‌లోని ఖోరత్‌ ప్రాంతంలో ఓ సైనికుడు తుపాకీ చేత పట్టుకొని ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఘాతుకానికి పాల్పడ్డాడు. కనిపించిన వారందరిపై ఇష్టానుసారంగా కాల్పులు జరిపినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో సుమారు 17మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ షాపింగ్‌ మాల్‌ ఎదుట తిరుగుతూ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాగా కాల్పుల ఘటన అనంతరం దుండగుడు షాపింగ్‌మాల్‌లోకి చొరబడి అక్కడి ప్రజలను బందీలుగా చేసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com