కియాపై ప్రతి పక్షం అనవసరంగా గగ్గోలు పెడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు ప్లాన్ అని అయన అన్నారు. రాయిటర్స్ కథనంపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నాము అని అయన తెలిపారు. సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో నా పేరు ఎందుకు ఉంటుంది అని అయన అన్నారు. సెలెక్ట్ కమిటీ ప్రక్రియ పూర్తి కాలేదన్న మండలి చైర్మన్ మాటలే కరెక్ట్ అని అయన తెలిపారు. మొదట చెప్పిన మాటలనే ఎవరైనా పరిగణలోకి తీసుకుంటామని అయన అన్నారు.