నెట్టింల్లో వైరల్ కావాలనే ఓ వ్యక్తి కోరిక.. 200 మంది ప్రయాణికులున్న విమానం మార్గ మధ్యంలోనే అత్యవసరంగా లాండ్ కావాల్సిన పరిస్థితికి దారితీసింది. టొరంటో నుంచి జమైకాకు వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న జేమ్స్ పొటోక్ ఫిలిప్పె (28) తన సీట్లోంచి ఒక్కసారిగా లేచి...తనకు కరోనా వైరస్ ఉందని చెప్పటంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. దీంతో భద్రతా నిబంధనలను అనుసరించి ఆ విమానాన్ని కెనడాలోని పియర్సన్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావటం కోసం ఆ వ్యక్తి ఆడిన అబద్ధమని విచారణలో తేలింది.