నిర్దేశిత సమయంలోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలించి తుది ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ సహా ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులకు సూచనలు ఇచ్చారు.