బ్రిటన్ రాజధాని లండన్లో ఆదివారం ఉగ్ర కలకలం చెలరేగింది. ఓ దుండగుడు కత్తితో పలువుర్ని పొడిచాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతణ్ని కాల్చి చంపారు. అనంతరం ఉగ్రవాద సంబంధిత ఘటనగా దాన్ని ప్రకటించారు. కాగా దుండగుడి దాడిలో ఎంతమంది గాయపడ్డారనే సంగతి స్పష్టంగా తెలియరాలేదు. గత ఏడాది నవంబరులో లండన్ వంతెన ప్రాంతంలో ఉస్మాన్ ఖాన్ అనే ఉగ్రవాది కత్తితో దాడి చేయడంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు.