చైనాలో కరోనా బారిన పడి ఆదివారం ఒక్కరోజే 57 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మరణించిన వారి సంఖ్య 361కి చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించారు. ఒక్కరోజులో 2,829 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 186 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటి వరకు 475 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరో 1,89,583 మంది అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. మరోవైపు 1000 పడకలతో వుహాన్లో నిర్మించిన ప్రత్యేక ఆస్పత్రి నేటి నుంచి అందుబాటులోకి రానుంది.