అమరావతి : మూడు రాజధానులు వద్దు-రాజధానిగా అమరావతే ఉండాలని నినదించినందుకు... ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ విసి గత శనివారం సస్పెండ్ చేశారు. ఈ చర్యను నిరసిస్తూ.. సస్పెండ్ అయిన నలుగురు విద్యార్థులకు మద్దతుగా సోమవారం ఉదయం జెఎసి నేతలు యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో జెఎసి నేతలతోపాటు గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గన్నారు.