ట్రెండింగ్
Epaper    English    தமிழ்

170కు చేరిన కరోనా మృతులు...

international |  Suryaa Desk  | Published : Thu, Jan 30, 2020, 12:37 PM

బీజింగ్‌: చైనాను వణికిస్తున్న డెడ్లీ వైరస్‌ కరోనాతో ఇప్పటి వరకూ 170 మంది మరణించారు. 6000 కరోనా కేసులను ఇప్పటివరకూ నిర్ధారించినట్టు అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాప్తితో కలకలం రేగడంతో చైనా నుంచి తమ దేశీయులను వెనక్కి రప్పించేందుకు భారత్‌ సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సహా పలు ఎయిర్‌లైన్‌లు చైనా నుంచి విమాన రాకపోకలను రద్దుచేశాయి. కరోనా వైరస్‌ బయటపడిన వుహన్‌ నగరం నుంచి తమ పౌరులను ఆయా దేశాలు వెనక్కిరప్పిస్తున్నాయి. వుహన్‌ నగరం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు చైనాలో భారత్‌ రాయబార కార్యాలయం సన్నాహాలు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com