భారత ప్రధాని మోదీకి ప్రపంచంలోనే లోనే ఏ నాయకుడికి లేని ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోదీ పలు ట్వీట్లు చేస్తుంటారు. ప్రధాని మోదీకి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అది కూడా ట్విట్ రూపంలో. ట్విట్టర్ అధికారికంగా ప్రకటించిన జాబితాలో మోదీ చేసిన ట్వీట్ గోల్డెన్ ట్వీట్ ఆఫ్ 2019గా నిలిచింది. ఆ ట్విట్ ఏంటంటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, విజయీ భారత్ మళ్లీ విజయం సాధించాం అంతా కలిసి సమగ్ర భారతవాని నిర్మిద్దాం అనే ట్విట్ 2019గాను గోల్డెన్ ట్వీట్ జాబితాలో చేరింది. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ ఈ ట్విట్ చేశారు. ఈ ట్విట్ కు రీట్వీట్లు, లైక్లు లో నెటిజన్లు హోరెత్తించారు. దీంతో ఈ ట్వీట్ తెగ వైరల్ అయింది. ప్రధాని మోదీ ట్వీట్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్ వైరల్ అయింది. భారత జట్టు మాజీ సారథి ధోని పుట్టిన రోజు కోహ్లి చేసిన నెటిజన్లను ఆకట్టుకుంది. కోహ్లీ చేసిన హ్యాపీ బర్త్డే మహి భాయ్. చాలా కొద్దీ మంది మాత్రమే నమ్మకం గౌరవంఅనే పదాలకు అర్థం చేసుకుంటారు. మీతో ప్రయాణం చేస్తునందుకు గర్వంగా ఉంది. మా అందరికి ఓ సోదరుడివి, నాకు ఓ మంచి ఫ్రెండ్ దొరికాడు, నేను ఎప్పుడు చెప్పినట్లు నువ్వు( ధోని) మా కెప్టెన్ వే.. అంటూ కోహ్లీ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ తర్వాత చాలా మంది నెటిజన్లు కోహ్లీని ప్రశంసించారు. కోహ్లీ తన మనస్సులోని భావాన్ని బయటపెట్టాడు అంటూ నెటిజన్లు పెర్కొన్నారు. కోహ్లీ చేసిన ఈ ట్విట్ కు నెటిజన్లు లైక్లు, రీట్వీట్లు చేశారు. రాజకీయా నాయకుల జాబితాలో ప్రదాని మోదీ ముందుంటే.. క్రీడాకాలరుల పరంగా కోహ్లీ ముందున్నారు.