ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేమ్ మధ్యలో బిడ్డకు పాలిచ్చి తల్లి ప్రేమను చాటిన వాలీబాల్ ప్లేయర్!

national |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 04:22 PM

మిజోరం స్టేట్‌ గేమ్స్‌ 2019 మంగళవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా లాల్వెంట్ లాంగీ అనే మహిళ టుయికుమ్‌ వాలీబాల్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది. అయితే, ఆమెకు ఏడు నెలల పసిపాప ఉంది. ఈ గేమ్‌లో విజయం సాధించాలన్న తపనతో పాటు తన పాప ఆకలిని తీర్చాలనే ఆలోచన ఆమెలో ఉంది. పాల కోసం ఏడుస్తున్న పాపకు గేమ్ మధ్యలో పాలిచ్చి తన తల్లిప్రేమను చాటుకుంది. పాపకు పాలిస్తున్న ఫోటోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసి మిజోరం క్రీడల శాఖ మంత్రి రాబర్ట్‌ రోమవియా ఆమెను మెచ్చుకోవడంతో పాటు పదివేలు నగదును అవార్డుగా ప్రకటించారు. ఆమె అంకితభావం మరియు ధైర్యానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. లాల్వెంట్ లాంగీ చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... ఒకవైపు క్రీడాకారిణిగా, మరొకవైపు తల్లిగా ఆమె రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిందని మరొక నెటిజన్ కామెంట్ పెట్టాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com