కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒక్క బులెట్ కూడా ప్రయోగించలేదు అని అయన అన్నారు. కశ్మీర్ లోయలో ప్రశాంతత లేదంటున్న కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదు అని అయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో రక్తపాతం జరగాలని కాంగ్రెస్ ఆశించింది అని అయన అన్నారు.