సన్నబియ్యం ఇస్తామని ఎక్కడ చెప్పలేదని సీఎం జగన్ అన్నారు. స్వర్ణ బియ్యమే సన్న బియ్యమని అయన అన్నారు. శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాం అని అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పంపిణి చేస్తున్న బియ్యాన్ని పరిశీలించండి. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కంటే రూ . 1,400 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం అన్నారు.