సిటిజెన్షిప్ అమెండ్మెంట్ బిల్లు (సిఎబి) కు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలలో భారీయెత్తున ఆందోళనలు చెలరేగాయి. విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో నిన్న సిఎబి ఆమోదం పొందింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎన్ఇఎస్ఒ) నేడు 11 గంటల బంద్కు పిలుపునిచ్చింది.