నేడు స్టాక్ మార్కెట్లలో అనూహ్యమైన చర్యలకు పాలపడుతున్న వారిని గుర్తించేందు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అన్ని విధాలుగా ప్రయత్నించి సమాచారాన్ని సేకరిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఫ్రంట్ రన్నింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైభవ్ ధడ్డా ట్రేడరు ఆనుపానులను ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా గుర్తించింది. వైభవ్తో పాటు అతని కుటుంబం కూడా క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపకుండా ఉండేలా నిషేధం విధించింది. ఇంకా పూర్తిగా చెప్పాలంటే.. ఫిడిలిటీ గ్రూప్లో పనిచేస్తున్న వైభవ్కు..కీలకమైన పలు ఆర్డర్లకు సంబంధించిన లావాదేవీలపై ముందస్తు సమాచారం ఉండేది.
ఈ సమాచారం ఆధారంగా అతను, అతని తల్లి అల్కా, సోదరి ఆరుషి స్టాక్ మార్కెటింగ్ లో ట్రేడింగ్ చేసేవారు. వైభవ్కి సంబంధించిన ఇతర వివరాలను సేకరించే క్రమంలో జైన్శుభ్బంధన్డాట్కామ్లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా ఈ ముగ్గురి మధ్య బంధుత్వాన్ని సెబీ గుర్తించింది. వీరు అక్రమంగా ఆర్జించిన రూ. 1.86 కోట్ల లాభాలను 15 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమచేయాలంటూ ఆదేశించింది. నిధులను దారి మళ్లించకుండా వారి ఖాతాలను స్తంభింపచేసింది. అంతే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడే వారికీ హెచ్చరికలు జారీ చేసింది