ప్రియాంకరెడ్డి సంఘటనతో మహిళలు తల్లడిల్లిపోయారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. దిశను నలుగురు మానవ మృగాళ్లు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి చంపేశారని చెప్పారు. ప్రియాంకరెడ్డి ను హత్య చేసిన వాళ్లు ఎన్ కౌంటర్ అయ్యారని తెలిపారు. రిషితేశ్వరిని చంపిన వాళ్లకు ఇంతవరకు శిక్ష పడలేదన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మహిళ భద్రతపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దన్నారు. బెయిల్ ఇస్తే సాక్షులను హతమార్చుతున్నారని, ఉన్నావ్ ఘటనే ఉదాహరణ అన్నారు. ఆడపిల్లను రేప్ చేస్తే తక్షణమే శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లపై చేయి వేయాలంటే వెన్నులో వణుకుపుట్టేలా చట్టాలుండలన్నారు.
ఆడవాళ్లను చంపుతుంటే టీడీపీ నేతలకు మనస్సాక్షి లేదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో టీడీపీ నేతలు ఉన్నారని ఆరోపించారు. లోకేష్ ఫొటోలు, అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్ అయి పోవాలన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడుతారేమోనని భయపడుతున్నారని అన్నారు.
లోకేశ్ తినే పప్పులోకి ఉల్లిపాయలు లేవని చంద్రబాబు బాధపడుతున్నారు తప్ప.. మహిళల భద్రతపై ఆలోచన లేదన్నారు. ఎందుకంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆయనకు ఆ బాధ తెలియదన్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు ఆడ పిల్లల భద్రత గురించి మాట్లాడుతుంటే అనసర రాద్ధాంతం చేయకూడదని తెలియదా అని నిలదీశారు.ఐదు సంవత్సరాల్లో చేసిన పాపాలు గుర్తుకొచ్చి టీడీపీ నేతలు కలవరపడుడతున్నారని విమర్శించారు. టీడీపీ నేతల అరాచకాలు భయటపడతాయని చర్చను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మార్వో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రెండు చోట్ల పోటి చేసి ఓడిపోయిన ఘనుడు పవన్ కళ్యాన్ అన్నారు. రేప్ చేసిన వాళ్లకు బెత్తం దెబ్బలు చాలని పవన్ అన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తల్లి, చెల్లి, అక్కను జగన్ సమానంగా చూస్తారని అన్నారు. ప్రతి మహిళకు జగన్ మీద నమ్మకం ఉందన్నారు.