ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసోంలో బంద్ కు పిలుపునిచ్చిన వామ ప‌క్షాలు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 07:26 PM

భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అసోంలో 12 గంటల బంద్‌కు 16 వామపక్ష సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబర్‌ 10న బంద్‌లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆ సంఘాలు కోరాయి. భారత పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నార్త్‌ ఈస్ట్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌ఈఎస్‌వో) కూడా నార్త్‌ ఈస్ట్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి బంద్‌ చేపట్టాలని ఎన్‌ఈఎస్‌వో విజ్ఞప్తి చేసింది. ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌(ఏఐయూడీఎఫ్‌) జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేపట్టింది. భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏఐయూడీఎఫ్‌ ఎంపీ బద్రూద్దీన్‌ అజ్మల్‌ తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com