భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ.. అసోంలో 12 గంటల బంద్కు 16 వామపక్ష సంఘాలు పిలుపునిచ్చాయి. డిసెంబర్ 10న బంద్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆ సంఘాలు కోరాయి. భారత పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్వో) కూడా నార్త్ ఈస్ట్ బంద్కు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి బంద్ చేపట్టాలని ఎన్ఈఎస్వో విజ్ఞప్తి చేసింది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టింది. భారత పౌరసత్వ(సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని ఏఐయూడీఎఫ్ ఎంపీ బద్రూద్దీన్ అజ్మల్ తేల్చిచెప్పారు.