ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదు

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 06:44 PM

మరో కీలకమైన బిల్లును ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. లోక్ సభలో పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఈ బిల్లు ఏ ఒక్క వర్గానికీ వ్యతిరేకం కాదని అన్నారు. దేశంలోని మైనార్టీలకు 0.001 శాతం కూడా ఈ బిల్లు వ్యతిరేకం కాదని తెలిపారు. బిల్లుకు సంబంధించి సభ్యులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సభ నుంచి ఏ పార్టీ కూడా వాకౌట్ చేయవద్దని కోరారు. మరోవైపు, ఈ బిల్లును వ్యతిరేకించాలంటూ తమ ఎంపీలకు టీఆర్ఎస్ విప్ జారీ చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com