ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాఫ్రికా యువతిని వ‌రించిన 2019 మిస్ యూనివర్స్ కిరీటం

national |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 06:40 PM

దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్నిగెలుచుకున్నారు. అమెరికా జార్జియా రాష్ట్రం అట్లాంటాలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో టుంజీ విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ 2018 కాత్రియోనా గ్రే.. జోజిబిని టుంజీకు కిరీటం అలంకరించారు. తొలి రన్నరప్‌గా ప్యూర్టారికో భామ అండెర్సన్, రెండో రన్నరప్‌గా మెక్సిన్ సుందరి సోఫియా ఆరాగన్ నిలిచారు. మొత్తం 90 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్‌కు చెందిన వర్తికా సింగ్‌కు టాప్ 20 లోనూ చోటుదక్కలేదు. ఇక, విజేతగా ప్రకటించడానికి ముందు టుంజీ మాట్లాడుతూ.. ‘నా రంగు, జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నా’ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. 26ఏళ్ల టుంజీ స్వస్థలం దక్షిణాఫ్రికాలోని సోలో. లింగ వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. లింగ వివక్షపై పోరాటానికి ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. మహిళలు తమను తాము ప్రేమించాలని, అందం అంటే సహజంగా ఉండాలని టూజీ పేర్కొన్నారు. నేటి తరం యువతలకు బోధించాలకునే ముఖ్యమైన అంశం ఏంటని న్యాయ నిర్ణేతలు అడిగిన చివరి ప్రశ్నకు జోజిబిన్ సమయస్ఫూర్తితో సమాధానం చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. నాయకత్వమే సరైన అంశమని టూజీ ఇచ్చిన సమాధానంతో సంతృప్తిచెందిన న్యాయ నిర్ణేతలు విశ్వ సుందరి 2019గా ప్రకటించారు. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓఫ్రా విన్‌ఫ్రే అభినందనలు తెలియజేశారు. నాయకత్వమే బలమైన అంశమనే టూజీ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com